ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మైనర్ బాలికను అగ్నికి ఆహుతి చేసిన కేసులో.. తల్లి, అమ్మమ్మకు జీవిత ఖైదు

ABN, First Publish Date - 2022-05-09T09:20:55+05:30

కూతురితో గొడవ పడి, కోపంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిందో తల్లి. ఆ అమ్మాయి అమ్మమ్మ కూడా దీనికి సహకారం అందించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కూతురితో గొడవ పడి, కోపంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిందో తల్లి. ఆ అమ్మాయి అమ్మమ్మ కూడా దీనికి సహకారం అందించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వెలుగు చూసింది. 

స్థానికంగా నివసించే ఇక ఇంట్లో తల్లి, అమ్మమ్మతో కలిసి ఒక మైనర్ బాలిక నివశిస్తోంది. ఏడేళ్ల క్రితం 2015 జులై 8న తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగ్గో అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడని, ఆ బాధతోనే తన కుమార్తె కిరోసిన్ పోసుకొని చనిపోయిందని ఆ తల్లి వాపోయింది. అయితే దర్యాప్తు సమయంలో పోలీసులకు వేరే నిజాలు తెలిశాయి. బాలికతో గొడవ పడిన అమ్మ, అమ్మమ్మ కలిసి.. ఆమెను హత్య చేశారని వెల్లడైంది. దీంతో వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 


దీనిపై విచారణ జరిపిన పోక్సో కోర్టు.. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొన్న జగ్గోను నిరపరాధిగా భావించి విడుదల చేసింది. అలాగే బాలికను హత్య చేసిన అమ్మ, అమ్మమ్మ ఇద్దరికీ జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 25 మంది సాక్షుల వాంగ్మూలాలు విని, 40 రకాల పత్రాలు పరిశీలించిన కోర్టు.. ఈ సంచలన తీర్పు వెల్లడించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!