Viral News: నీటిలో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు
ABN, First Publish Date - 2022-05-10T00:56:08+05:30
రాజస్థాన్లో ఓ సరస్సులో కరెన్సీ నోట్లు కొట్టుకురావడం స్థానికంగా కలకలం రేపింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాలిథిన్ కవర్లో కరెన్సీ కట్టల్ని నీటిలోకి విసిరిపారేశారు. దీంతో అజ్మేర్లోని అనాసాగర్ సరస్సులో
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్లో ఓ సరస్సులో కరెన్సీ నోట్లు కొట్టుకురావడం స్థానికంగా కలకలం రేపింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాలిథిన్ కవర్లో కరెన్సీ కట్టల్ని నీటిలోకి విసిరిపారేశారు. దీంతో అజ్మేర్లోని అనాసాగర్ సరస్సులో డబ్బులు తేలియాడుతూ కనిపించాయి. అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు దాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, నీటిలో కొట్టుకొచ్చిన కరెన్సీ కట్టలన్నీ రూ. 2వేల నోట్లుగా పోలీసులు గుర్తించారు. అవి తడిసిపోవడంతో వాటిని లెక్కించేందుకు వీలు పడలేదు. అయితే.. నోట్ల కట్టల్ని నీటిలోకి ఎవరు విసిరేశారో గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.