Viral News: ఉద్యోగులకు యజమాని వెరైటీ ఆఫర్.. ఆఫీస్లో సహోద్యోగులు అలా చేస్తున్నారని చెబితే.. రూ.1500 ఇస్తానంటూ ప్రకటన!
ABN, First Publish Date - 2022-05-06T03:28:52+05:30
కొందరు యజమానులు తమ ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటూనే తమకు కావాల్సిన పని చేయించుకుంటారు. మరికొందరు మాత్రం తమ కింద పని చేసే వారిపై అజమాయిషీ చెలాయిస్తూ.. కఠిన నిబంధనలను అమలు
ఇంటర్నెట్ డెస్క్: కొందరు యజమానులు తమ ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటూనే తమకు కావాల్సిన పని చేయించుకుంటారు. మరికొందరు మాత్రం తమ కింద పని చేసే వారిపై అజమాయిషీ చెలాయిస్తూ.. కఠిన నిబంధనలను అమలు చేయడం ద్వారా ఎక్కువ పని చేయించుకోవాలని అనుకుంటారు. ఇపుడు మనం చెప్పుకోబోయేది ఈ రెండో కోవకు చెందిన యజమాని గురించే. ఓ కంపెనీ అధిపతి తన ఉద్యోగులకు విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
అస్తమానం ఏదో ఒకటి తింటూ పని చేయడం లేదు అనుకున్నాడో ఏమో కానీ ఓ యజమాని మాత్రం తన ఉద్యోగుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. పని సమయాల్లో ఉద్యోగులు ఎవరూ తినకూడదు అంటూ వార్నింగ్ లెటర్ జారీ చేశాడు. అంతేకాకుండా ఉద్యోగులకు వెరైటీ ఆఫర్ ఇచ్చాడు. సహోద్యోగులు ఎవరైనా ఈ మాట లెక్క చేయకుండా వర్కింగ్ అవర్స్లో తింటే.. ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలని తెలిపాడు. అలా చేస్తే సమాచారం అందించిన ఉద్యోగికి 20డాలర్లు(సుమారు రూ.1500) ఇస్తానంటూ డబ్బు ఆశ చూపించాడు. కాగా.. ఓ ఉద్యోగి తన బాస్ జారీ చేసిన వార్నింగ్ లెటర్ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా ఇపుడు వైరల్ అయింది.