ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

UAE President మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

ABN, First Publish Date - 2022-05-14T17:28:29+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకస్మిక మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకస్మిక మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు. "షేక్ ఖలీఫా బిన్ జాయెద్ ఆకస్మిక మృతి పట్ల చాలా బాధగా ఉంది" అని మోదీ ట్వీట్ చేశారు. దివంగత యూఏఈ ప్రెసిడెంట్ గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు అని కొనియాడారు. అతని ఆధ్వర్యంలో భారత్-యూఏఈ సంబంధాలు అభివృద్ధి పథంలో కొనసాయని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయ సమాజం యూఏఈ ప్రజలతో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని ప్రార్థించారు. భారత విదేశాంగ శాఖమంత్రి ఎస్ జైశంకర్ కూడా యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతిపై తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు.  




1948లో జన్మించిన ఖలీఫా 2004లో అత్యంత ధనిక ఎమిరేట్ అబుదాబిలో అధికారంలోకి వచ్చి దేశాధినేత అయ్యారు. ఇప్పుడాయన సవతి సోదరుడు, క్రౌన్ ప్రిన్స్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబి తదుపరి పాలకుడు అయ్యే అవకాశం ఉంది. షేక్‌ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. ఖలీఫా మృతి నేపథ్యంలో ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వశాఖలతో పాటు ప్రైవేటు రంగంలోనూ దాదాపు 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. అలాగే, మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!