నలుగురు భారతీయులకు పులిట్జర్ అవార్డు.. దివంగత ఫొటోగ్రాఫర్ సిద్దిఖీకి రెండోసారి గౌరవం
ABN, First Publish Date - 2022-05-11T13:05:46+05:30
నలుగురు భారత ఫొటో జర్నలిస్టులను ప్రఖ్యాత పులిట్జర్ అవార్డు వరించింది.
కరోనా తీవ్రతను వివరించేలా వారు తీసిన ఫొటోలకు పురస్కారం
అఫ్ఘాన్ ఆర్మీ, తాలిబన్ల షుర్షణల ఫొటోలను తీసేందుకు వెళ్లి హతం
ఉక్రెయిన్ జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలు
న్యూయార్క్, మే 10: నలుగురు భారత ఫొటో జర్నలిస్టులను ప్రఖ్యాత పులిట్జర్ అవార్డు వరించింది. రాయిటర్స్కు చెందిన దివంగత దానిష్ సిద్ధిఖీ, అద్నాన్ అబిది, సన్నా ఇర్షద్ మట్టో, అమిత్ దవే 2022 ఏడాదికి ఈ బహుమతికి ఎంపికయ్యారు. భారత్లో కరోనా తీవ్రతను వివరించేలా వా రు తీసిన ఫొటోలకు ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కిందని పులిట్జర్ అవార్డుల వెబ్సైట్ పేర్కొంది. దానిష్ సిద్ధిఖీ(38) ఈ పురస్కారానికి ఎంపికవ్వడం ఇది రెండోసారి. రోహింగ్యాల సంక్షోభం అప్పుడు తీసిన చిత్రాలకు 2018లో తొలిసారి ఈ అవార్డు అందుకున్నారు. అఫ్ఘాన్ బలగాలు, తాలిబన్ల మధ్య జరుగుతున్న షుర్షణల ఫొటోలను తీసేందుకు వెళ్లి నిరుడు జులైలో అఫ్ఘానిస్థాన్లో హత్యకు గురయ్యారు. ఇక, రష్యా దురాక్రమణతో తమ దేశంలో నెలకొన్న పరిస్థితిని ప్రపంచానికి తెలియజేస్తున్న ఉక్రెయిన్ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు బోర్డు ప్రత్యేక పురస్కారాలు ప్రకటించింది.