ప్రయాణికుడి హల్చల్.. ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసి, విమానం రెక్కపై నడుస్తూ..
ABN, First Publish Date - 2022-05-07T19:06:50+05:30
రన్నింగ్లో ఉన్న విమానంలోని ఓ ప్రయాణికుడు హల్చల్ చేశాడు. కొద్దిసేపు విమానంలోని తోటి ప్రయాణికులతో పాటు సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేశాడు.
చికాగో: రన్నింగ్లో ఉన్న విమానంలోని ఓ ప్రయాణికుడు హల్చల్ చేశాడు. కొద్దిసేపు విమానంలోని తోటి ప్రయాణికులతో పాటు సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేశాడు. మరికాపేట్లో విమానం టెర్మినల్ చేరుతుందనగా ఉన్నట్టుండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేశాడు. అనంతరం విమానం రెక్కపై నడవడం మొదలెట్టాడు. ఈ ఘటన అమెరికాలోని చికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) చోటు చేసుకుంది. కాగా, ఈ దుశ్చర్యకు పాల్పడిన ఆ ప్రయాణికుడిని విమానాశ్రయ సిబ్బంది అదుపు చేసేలోపు రెక్కల మీదకు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశాడు. దాంతో రంగంలోకి దిగిన ఎయిర్పోర్ట్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాలిఫోర్నియాకు చెందిన ర్యాండీ ఫ్రాంక్ డెవిలా(57)గా పోలీసులు గుర్తించారు. శాండియాగో నుంచి వస్తున్న ఈ విమానం ల్యాండ్ అవగానే కిందకు దూకేసిన ర్యాండీ.. ఫ్లైట్ను టెర్మినల్కు చెర్చేందుకు పైలట్లకు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు. అతడి బాధ్యతరాహిత్యమైన చర్య నేపథ్యంలో చికాగో పోలీసులు రిమాండ్కు తరలించారు. జూన్ 27న కోర్టులో హాజపరుస్తామని పోలీసులు వెల్లడించారు.