ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రేపటినుంచి అగ్ని నక్షత్రం ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-03T13:20:36+05:30

రాష్ట్రంలో వేసవి సీజన్‌ ప్రారంభానికి ముందే ఎండ తీవ్రత పెరిగింది. సోమవారం 13 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదుకాగా, కాంచీపురం జిల్లాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- ఇక సెగలే...! 

- 28 రోజులు తప్పని ఎండ తీవ్రత


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో వేసవి సీజన్‌ ప్రారంభానికి ముందే ఎండ తీవ్రత పెరిగింది. సోమవారం 13 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదుకాగా, కాంచీపురం జిల్లాల్లో అత్యధికంగా 43 డిగ్రీలు దాటింది. ఈ నేపధ్యంలో, వేసవి సీజన్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అగ్ని నక్షత్రం ఈ నెల 4వ తేది ప్రారంభమై 28 రోజులు కొనసాగనుంది. సాధారణంగా అగ్ని నక్షత్రంగా పిలువబడే రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయని పెద్దలు చెబుతుంటారు. ఈ సమయంలో సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 8.30 నుంచే ప్రారంభమవుతున్న ఎండ తీవ్రత సాయంత్రం 4.30 గంటల వరకు తగ్గడం లేదు. సోమవారం తిరుత్తణి, వేలూరులో 42 డిగ్రీలు, సేలం, మదురై, కరూర్‌ పరమత్తిలో 40, సేలం, ఈరోడ్‌, మాధవరంలలో 39, చెన్నై విమానాశ్రయం, ధర్మపురి, తంజావూరు, తిరునల్వేలిలలో 38 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యవసర పనులకు బయటకు వెళ్లే వారు మజ్జిగ, శీతల పానీయాలు సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!