ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

దగ్గర పరీక్షా కేంద్రాల్లో డ్యూటీ వేయాలి: టీచర్లు

ABN, First Publish Date - 2022-05-04T16:20:49+05:30

తక్కువ దూరంలో ఉన్న పరీక్షా కేంద్రాల్లో తమకు విధులు కేటాయించాలని టీచర్లు డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పెరంబూర్‌(చెన్నై): తక్కువ దూరంలో ఉన్న పరీక్షా కేంద్రాల్లో తమకు విధులు కేటాయించాలని టీచర్లు డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సేలం జిల్లాలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్ల నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో సుమారు 200 మందికి పైగా టీచర్లు జిల్లా ప్రధాన విద్యాధికారి కార్యాలయం ముందు భైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు ఉపాధ్యాయులకు కేటాయించిన పరీక్షా కేంద్రాలు 35 నుంచి 80 కి.మీ దూరం ఉన్నాయన్నారు. విధులకు హాజరుకావాలంటే ఉపాధ్యాయులు ఒకరోజు ముందుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కొన్ని పరీక్షా కేంద్రాలకు వెళ్లాలంటే అర్ధరాత్రి 2 గంటలకు ఇంటి నుంచి బయల్దేరాల్సి ఉందన్నారు. 50 ఏళ్లకు పైబడిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముందని, ఈ విషయం పరిశీలించి తక్కువ దూరంలోని పరీక్షా కేంద్రాలు కేటాయించాలని కోరారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!