Russia Ukraine War వేళలో Yogi కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-05-11T03:32:27+05:30
మీరట్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మీరట్: Russia Ukraine యుద్ధ వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి Yogi Adityanath కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం సంక్షోభం ఎదుర్కుంటున్నప్పుడల్లా భారత్ వైపు ఆశగా చూస్తుంటుందని ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలు అలాగే చూస్తున్నాయని చెప్పారు. మానవాళి ఇబ్బందులు ఎదుర్కుంటున్నప్పుడల్లా పరిష్కారం చూపిన చరిత్ర భారత్దన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర Modi నేతృత్వంలో శాంతి చర్చలు జరగాలని ప్రపంచ దేశాధినేతలు కోరుకుంటున్నారని యోగి చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఇప్పటికే రెండు నెలల సమయం దాటింది. వేలాది మంది చనిపోయారు. అనేక మంది ఉక్రెయిన్ విడిచి విదేశాలకు వలస వెళ్లారు.