Chennai రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య ?
ABN, First Publish Date - 2022-05-10T16:12:43+05:30
తిరువళ్లూరు సమీపం పాప్పరంబాక్కం రహదారి పక్కన చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక అంబత్తూరు సమీపంలోని అయనంబాక్కంకు
చెన్నై: తిరువళ్లూరు సమీపం పాప్పరంబాక్కం రహదారి పక్కన చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక అంబత్తూరు సమీపంలోని అయనంబాక్కంకు చెందిన గుణశేఖరన్ (62) రియల్ ఎస్టేట్ వ్యాపారి. మనస్పర్థల కారణంగా భార్యా పిల్లలు విడిపోవడంతో ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పాప్పరంబాక్కం రహదారి వద్ద మంటల్లో దగ్ధమైన కారు, దాని పక్కనే నేలపై ఒంటి నిండా కాలిన గాయాలతో గుణశేఖరన్ శవంగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తిం చారు. మనవాళనగర్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వ్యాపారంలో పోటీ కారణంగా ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.