మద్యం షాపులు మూసేయాలి
ABN, First Publish Date - 2022-05-04T17:05:24+05:30
మద్యం దుకాణాలు మూసి విద్యార్థులను కాపాడడంపై దృష్టిసారించాలని పీఎంకే వ్యవస్థాపకుడు డా.రాందాస్ రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన
- పీఎంకే నేత రాందాస్
పెరంబూర్(చెన్నై): మద్యం దుకాణాలు మూసి విద్యార్థులను కాపాడడంపై దృష్టిసారించాలని పీఎంకే వ్యవస్థాపకుడు డా.రాందాస్ రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలి కాలంలో విద్యార్థులు మద్యం సేవించడం, ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడే ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. భావిభారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు చిన్న వయస్సులోనే మద్యానికి బానిసలు కావడం బాధాక రమని విచారం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలు మూసే చర్యలు చేపట్టాలని రాందాస్ విజ్ఞప్తి చేశారు.