ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పళనిలో Electrical వించ్‌ ట్రయల్‌ రన్‌

ABN, First Publish Date - 2022-05-14T15:51:13+05:30

సుప్రసిద్ధ శైవక్షేత్రం పళని పర్వతాలయానికి భక్తులను తీసుకెళ్లే మూడో ఎలక్ట్రికల్ వించ్‌ మరమ్మతులు శుక్రవారం తో ముగిశాయి. ఆ వించ్‌ పనితీరును భద్రతాధికారులు పరిశీలించి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చెన్నై: సుప్రసిద్ధ శైవక్షేత్రం పళని పర్వతాలయానికి భక్తులను తీసుకెళ్లే మూడో ఎలక్ట్రికల్ వించ్‌ మరమ్మతులు శుక్రవారం తో ముగిశాయి. ఆ వించ్‌ పనితీరును భద్రతాధికారులు పరిశీలించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. పళని ఆలయానికి కొండదిగువ నుంచి భక్తులను తరలించేందుకు రోప్‌కారు, మూడు ఎలక్ట్రికల్ వించ్‌లను ఉపయోగిస్తున్నారు. భద్రతావిభాగం అధికారులు నెలకొకసారి రోప్‌కారును, వించ్‌లను పరిశీలించడం ఆనవాయితీ. ఇటీవల వీటిని పరిశీలించినప్పుడు మూడో ఎలక్ట్రికల్ వించ్‌ ఇనుప దారం బాగా దెబ్బతినడం గమనించారు. దీంతో ఆ మూడో వించ్‌కు మరమ్మతులు చేపట్టారు. ఆ వించ్‌కు కొత్తగా ఇనుప తాడు బిగించి మరమ్మతులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఈ వించ్‌లో పంచామృతం డబ్బాలు ఎక్కించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. కొండదిగువ నుంచి పర్వతాలయం వరకూ ఈ వించ్‌ సక్రమంగా నడవటంతో భద్రతా విభాగం అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మూడో ఎలక్ట్రికల్ వించ్‌ను ఒక రెండు రోజుల్లోగా ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!