ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కాంగ్రెస్‌లో మళ్లీ ఒక కుటుంబం - ఒకే టికెట్‌’

ABN, First Publish Date - 2022-05-11T08:17:32+05:30

పార్టీని పునరుత్థానం వైపు నడిపించడంలో భాగంగా... ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ ఇవ్వాలనే నిబంధనను అమలుచేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

గాంధీ కుటుంబానికి మాత్రం ఆ నిబంధన నుంచి మినహాయింపు!

న్యూఢిల్లీ, మే 10: పార్టీని పునరుత్థానం వైపు నడిపించడంలో భాగంగా... ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ ఇవ్వాలనే నిబంధనను అమలుచేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఈ నెల 13-15 తేదీల మధ్య రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్న మేధో మథన సదస్సులో ఇదే అంశం ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో కూడా ‘ఒక కుటుంబం - ఒకే టికెట్‌’ నిబంధనపై చర్చించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం మరోసారి జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిబంధనను పార్టీ ఆమోదించే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధన గాంధీ కుటుంబానికి వర్తించబోదని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రె్‌సను కుటుంబ పార్టీగా ఎప్పటినుంచో విమర్శిస్తోన్న బీజేపీకి ఈ మినహాయింపు మరో అస్త్రం కావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీలో సమష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా పార్లమెంటరీ బోర్డు ను పునరుద్ధరించే ఆలోచన ఉందని ఓ కాంగ్రెస్‌ నేత చెప్పారు. చర్చల అనంతరం ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ పేరుతో నిర్ణయాలను ప్రకటిస్తారని తెలిపారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!