ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఇద్దరు రౌడీల దారుణ హత్య

ABN, First Publish Date - 2022-05-10T16:16:51+05:30

తిరువళ్లూరు జిల్లా పొన్నేరి, మీంజూరు ప్రాంతాల్లో పేరుమోసిన ఇద్దరు రౌడీలను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. మీంజూరు సమీపం వయలూరులో

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చెన్నై: తిరువళ్లూరు జిల్లా పొన్నేరి, మీంజూరు ప్రాంతాల్లో పేరుమోసిన ఇద్దరు రౌడీలను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. మీంజూరు సమీపం వయలూరులో బార్‌ నడుపుతున్న రౌడీ మూర్తి (40)పై పలు హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. సోమవారం ఉదయం మూర్తి తన బార్‌ వద్ద పనిచేస్తుండగా గుర్తు తెలియని ఏడుగురు వేటకొడవళ్లతో వచ్చి ఆయనపై దాడి చేశారు. మూర్తి అక్కడి కక్కడే చనిపోయాడు. బార్‌ను నడిపే విషయమై వయలూరుకు చెందిన ఓ వ్యక్తికి, మూర్తికి మధ్య పాత తగాదాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుం దని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదేవిధంగా పొన్నేరి వెంబాక్కం ప్రాంతంలో జవహర్‌ (31) అనే రౌడీ తన అనుచరుడు సీనాతో కలిసి ద్విచక్ర వాహనంలో  వెళుతుండగా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. జవహర్‌కు మరో రౌడీకి మధ్య పాతతగాదాలు ఉన్నాయని, ఆ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!