ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

MK Stalin పాలనకు ఏడాది..బస్సులో ప్రయాణించిన సీఎం

ABN, First Publish Date - 2022-05-07T21:40:11+05:30

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం శనివారం తొలి ఏడాది పాలన..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK.Stalin) సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం శనివారం తొలి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MTC) బస్సులో ప్రయాణించి నేరుగా ప్రయాణికులతో ముచ్చటించారు. అసెంబ్లీలో పలు ప్రజాసంక్షేమ ప్రకటనలు చేశారు.


రాధాకృష్ణ సాలైలో 29C నెంబర్ బస్సులో స్టాలిన్ ప్రయాణిస్తూ, తమ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం గురించి వారితో కాసేపు మాట్లాడారు. దీనికి ముందు, తన తండ్రి దివంగత సీఎం కరుణానిధి, డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై సమాధులపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం, అసెంబ్లీలో పలు ప్రజా సంక్షేమ ప్రకటనలు చేశారు. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకూ విద్యార్థులకు అన్ని పనిదినాల్లో న్యూట్రీషియన్ బ్రేక్‌ఫాస్ట్ అందిస్తామని ప్రకటించారు. గత ఏడాదిగా తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రస్తావించారు. ద్రవిడయన్ మోడల్ తరహాలో రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల వైద్య అవసరాల కోసం మరిన్ని అర్బన్ మెడికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!