కుమరిలో ‘అల’జడి

ABN , First Publish Date - 2022-05-14T13:02:50+05:30 IST

కన్నియాకుమారిలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. తీరానికి రాక్షస అలలు వస్తున్నాయి. దీంతో కుమరి సముద్ర తీరంలో సముద్ర స్నానాలపై నిషేధం విధించారు.

కుమరిలో ‘అల’జడి

- ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు 

- స్నానాలపై నిషేధం


అడయార్‌(చెన్నై): కన్నియాకుమారిలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. తీరానికి రాక్షస అలలు వస్తున్నాయి. దీంతో కుమరి సముద్ర తీరంలో సముద్ర స్నానాలపై నిషేధం విధించారు. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి సమయాల్లోనే సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. దీనికితోడు ప్రకృతి సహజ మార్పుల వల్ల సముద్రంలో రాక్షస అలలు ఎగసిపడుతున్నాయి. ‘అసాని’ ప్రభావం కారణంగా సముద్రంలో కూడా మార్పులు సంభవించాయి. దీంతో సముద్రపు నీరు ఒక్కసారిగా వెనక్కిపోవడం, ముందుకురావడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నియాకుమారి తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలలు 10 నుంచి 15 అడుగుల ఎత్తులో వస్తున్నాయి. ఇక్కడకు వచ్చే పర్యాటకులు అలలు ఎగసిపడుతున్నా సముద్ర స్నానాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. దీంతో యాత్రీకులు సముద్ర స్నానానికి వెళ్లకుండా పోలీసులు నిషేధం విధించారు.

Read more