భారత్లో కొత్తగా 3,805 కరోనా కేసులు
ABN, First Publish Date - 2022-05-07T15:24:14+05:30
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,805 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,805 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 3,168 మంది డిశ్చార్జ్ అవగా... 22 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 20,303గా ఉంది. దేశవ్యాప్తంగా కోవిడ్తో 5,24,024 మంది మృతి చెందారు.