ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Cyclone Asani: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ABN, First Publish Date - 2022-05-10T23:46:58+05:30

బంగాళా ఖాతంలో ఏర్పడిన పెను తుపాను అసని (Cyclone Asani)

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

భువనేశ్వర్ : బంగాళా ఖాతంలో ఏర్పడిన పెను తుపాను అసని  (Cyclone Asani)  దిశ మార్చుకున్నట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ తుపాను ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని మొదట్లో భావించినప్పటికీ, ఇది దిశ మార్చుకుని ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోందని పేర్కొంది. బుధవారం సాయంత్రానికి మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోందని, ఆ తర్వాత విశాఖపట్నం వద్ద సముద్రంలోకి వెళ్ళవచ్చునని అంచనా వేస్తోంది. 


అసని తుపాను (Cyclone Asani) ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ తుపాను తూర్పు కోస్తాకు సమీపించినట్లు తెలిపింది. గంటకు 105 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ తుపాను మంగళవారం క్రమంగా బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు వెల్లడించింది.


ఈ నేపథ్యంలో విశాఖపట్నం నౌకాశ్రయం (Port)లో కార్యకలాపాలను నిలిపేశారు.  Visakhapatnam అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం నుంచి 23 విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు తెలిపారు. 


IMD (వాతావరణ శాఖ) తాజాగా ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, మే 10 మంగళవారం రాత్రి నుంచి ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అసని తుపాను కారణంగా బంగాళాఖాతంపై తూర్పు గాలుల వల్ల ఉత్తర భారత దేశంలో అత్యధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత్తల్లో పెరుగుదల పెద్దగా కనిపించలేదని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. అయితే తేమ స్థాయి పెరగడంతో అసౌకర్యంగా ఉంటుందని తెలిపింది. 


IMD వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడ, విశాఖపట్నం తీరాలకు అసని తీవ్ర తుపాను మే 11 ఉదయానికి చేరుతుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి సాగుతూ తుపానుగా బలహీనపడుతుంది. 


మంగళవారం సాయంత్రం  ఐఎండీ విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపిన వివరాల ప్రకారం, తీవ్ర అసని Cyclonic storm పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడకు దక్షిణ-ఆగ్నేయ దిశలో 210 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖపట్నానికి దక్షిణ దిశలో 300 కిలోమీటర్ల దూరంలోనూ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌నకు దక్షిణ-నైరుతి దిశలో 530 కిలోమీటర్ల దూరంలోనూ, ఒడిశాలోని పూరీకి దక్షిణ-నైరుతి దిశలో 570 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న ఈ తుపాను వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాలకు చేరుకుంటుందని అంచనా. ఆ తర్వాత ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి, వాయవ్య బంగాళాఖాతంవైపు వెళ్తుందని, ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలను తాకుతుందని అంచనా. ఈ తుపాను మంగళవారం సాయంత్రం దిశ మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశలో ప్రయాణించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


Cyclone Asani ప్రభావం తెలంగాణాపై కూడా...

అసని తుపాను కారణంగా తెలంగాణాలో కూడా రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం  తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో బుధవారం చెదురుమదురుగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. 



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!