Bank fraud case: పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే నివాసాలపై సీబీఐ దాడులు
ABN, First Publish Date - 2022-05-08T02:12:08+05:30
పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రా నివాసాలపై సీబీఐ శనివారంనాడు...
న్యూఢిల్లీ: పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రా (Jaswant singh Gajjan Majra) నివాసాలపై సీబీఐ (CBI) శనివారంనాడు దాడులు జరిపింది. సంగ్రూర్లోని మూడు ప్రాంతాల్లో ఈ రెయిడ్స్ జరిగాయి. రూ.40 కోట్ల మేరకు బ్యాంకు అవకతవకలకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ దాడులు జరిపింది. రూ.16.57 లక్షలు విలువచేసే విదేశీ కరెన్సీ, ప్రాపర్టీ డాక్యుమెంట్లు, బ్యాంకు అకౌంట్లు, 94 బ్లాంక్ చెక్కులు, పలు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకుంది.
''బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. గౌన్సుపుర విలేజ్కు చెందిన ఒక ప్రైవేటు సంస్థ, అప్పటి డైరెక్టర్లు, గ్యారంటర్లు, మరో ప్రైవేటు సంస్థ, గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులపై ఫిర్యాదులు నమోదయ్యాయి'' అని సీబీఐ తెలిపింది.