ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Shiv Sena పెళ్లి BJPతో ఫిక్సైంది. కానీ..: కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2022-05-09T16:40:19+05:30

chief minister పదవి కోసం శివసేన మమ్మల్ని (బీజేపీ) వదిలి పెట్టింది. కానీ మాకు మేముగా శివసేనను వదిలేయలేదు. ఎవరు ఎవరిని వదిలిపెట్టి వెళ్లారని ప్రజలు నిర్ణయిస్తారు. నిజానికి బీజేపీతో పెళ్లి నిర్ణయించబడింది. కానీ వేరే పార్టీతో పారిపోయింది..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యాలతో వార్తల్లో తిరగాడే కేంద్ర మంత్రి Raosaheb Danve మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. Shiv Sena, BJP ల మైత్రి ఏనాటిదో తెలిసిందే. అయితే కొంత కాలంగా ఇరు పార్టీలు వైరి పార్టీలయ్యాయి. ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ శివసేన Marriage భారతీయ జనతా పార్టీతో నిర్ణయించబడిందని, అయితే బీజేపీని వదిలేసి వేరే పార్టీతో శివసేన పారిపోయిందంటూ ఆయన అన్నారు. Maharashtra లోని Jalnaలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘chief minister పదవి కోసం శివసేన మమ్మల్ని (బీజేపీ) వదిలి పెట్టింది. కానీ మాకు మేముగా శివసేనను వదిలేయలేదు. ఎవరు ఎవరిని వదిలిపెట్టి వెళ్లారని ప్రజలు నిర్ణయిస్తారు. నిజానికి బీజేపీతో పెళ్లి నిర్ణయించబడింది. కానీ వేరే పార్టీతో పారిపోయింది’’ అని దాన్వే అన్నారు. ఇక ముఖ్యమంత్రి Uddhav Thackeray ను నేరుగా ప్రస్తావిస్తూ ‘‘బీజేపీ-శివసేన కూటమికి (2019అసెంబ్లీ ఎన్నికలు) ప్రజలు ఓట్లేశారు. కానీ నువ్వు (ఉద్ధవ్ థాకరే) ప్రజా తీర్పును కాలరాసి కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపావు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఇప్పుడు నీ రోజులు బాగానే ఉన్నాయేమో.. కానీ 12 కోట్ల మహారాష్ట్రీయుల రోజులను నాశనం చేస్తున్నారు’’ అని అన్నారు.


బీజేపీ-శివసేన మైత్రి రెండు దశాబ్దాలకు పైగా కొనసాగింది. దేశంలో అతిపురాతన రాజకీయ పొత్తులో ఇది ఒకటి. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇరు పార్టీల మధ్య ముఖ్యమంత్రి పదవి విషయంలో విబేధాలు వచ్చాయి. దీంతో బీజేపీ నుంచి శివసేన విడిపోయి కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని మహా వికాస్ అగాఢీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి తరపున శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అయ్యారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!