ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Mysuru బార్‌లో దారుణం.. బీరు సీసాలు, కత్తులతో ప్రత్యర్థి వర్గంపై దాడి

ABN, First Publish Date - 2022-05-03T22:39:23+05:30

Mysuru బార్‌లో దారుణం.. బీరు సీసాలు, కత్తులతో ప్రత్యర్థి వర్గంపై దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మైసూరు: బార్‌లో ఉన్న ప్రత్యర్థి వర్గంపై కొందరు వ్యక్తులు బీరు బాటిళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. Mysuruలోని బన్నూరు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో Social Mediaలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం.. బార్‌లో కూర్చుని ఉన్న వ్యక్తిపై వెనక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బీరు బాటిళ్లతో దాడిచేశారు. తొలుత ఓ వ్యక్తి బాధితుడి తలపై బీరు బాటిల్ పగలగొట్టగా, వెనకే వచ్చిన రెండో వ్యక్తి కూడా బీరు బాటిల్ పగలగొట్టాడు. 


ఆ తర్వాత అతడిని కుర్చీలోంచి కిందికి తోసేసి దాడిచేశారు. మరో వ్యక్తి పొడవాటి కత్తితో అతడిపై దాడికి దిగాడు. కిందపడిన వ్యక్తి వారిని నెట్టి పైకి లేచి ఎదురుదాడికి దిగారు. దీంతో సీన్ Bar బయటకు మారింది. అయినప్పటికీ బాధితుడిని వదలకుండా కత్తితో దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బన్నూరు పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 


బాధితుడైన దయానంద్ మరో గ్యాంగ్‌కు చెందినవాడని, అతడిపైనా హిస్టరీ షీట్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దయానంద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ముఖ్యంగా ముగ్గురి పేర్లతోపాటు మరికొందరి పేర్లను కూడా పేర్కొన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఘటనకు గల కారణం తెలియరాలేదని అన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!