ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆటోపై పడిన చెట్టు: మహిళ సహా ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2022-05-06T15:56:44+05:30

తిరునల్వేలి జిల్లా పత్తమడైలో ఆటోపై చెట్టు పడిన ఘటనలో మహిళ సహా ఇద్దరు మృతిచెందారు. పాళయంకోట నుంచి అంపాసముద్రం వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పెరంబూర్‌(చెన్నై): తిరునల్వేలి జిల్లా పత్తమడైలో ఆటోపై చెట్టు పడిన ఘటనలో మహిళ సహా ఇద్దరు మృతిచెందారు. పాళయంకోట నుంచి అంపాసముద్రం వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం పనులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించే పనులు చేపట్టారు. ఓ చెట్టు తొలగించే సమయంలో హఠాత్తుగా రోడ్డుపై ఒరిగి పోయింది. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆటోపై చెట్టు పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ ఖాదర్‌, రహమత్‌ అనే మహిళ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రోడ్డు విస్తరణ పనులపై అధికారులు ఎటువంటి హెచ్చరిక లేకుండానే పనులు ప్రారంభించడంతో ఈ ప్రమాదం జరిగిందంటూ ఆరోపిస్తూ మృతుల బంధువులు రాస్తారోకో చేపట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసు, రెవెన్యూ, రహదారులశాఖ అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!