RBI Effect :ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల నష్టం

ABN , First Publish Date - 2022-05-04T23:11:15+05:30 IST

ముంబై : రెపో రేటును పెంచుతూ కేంద్ర బ్యాంకు Rbi తీసుకున్న నిర్ణయం దేశీయ Equity markets పై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.

RBI Effect :ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల నష్టం

ముంబై : రెపో రేటును పెంచుతూ కేంద్ర బ్యాంకు Rbi తీసుకున్న నిర్ణయం దేశీయ Equity markets పై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియాతో మాట్లాడడానికి ముందు 600 పాయింట్ల నష్టంలో ఉన్న Sensex  రెపో రేటు పెంపు ప్రకటన రాగానే ఒక్కసారిగా పతనమైంది. నష్టాలు రెట్టింపు అయ్యాయి.  చివరికి 1307 పాయింట్లు లేదా 2.29 శాతం మేర క్షీణించి  55,669 పాయింట్ల వద్ద  సెన్సెక్స్ ముగిసింది. NSE Nifty కూడా ఇదే పరిస్థితి. 392 పాయింట్లు లేదా 2.29  శాతం దిగజారి 16,678 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో బుధవారం ఒక్కరోజే రూ.6.1 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్‌‌‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 265.88 లక్షల కోట్ల నుంచి రూ.259.73 లక్షల కోట్లకు పడిపోయింది. కాగా గత నెల ఏప్రిల్‌లో దాదాపు రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హుష్‌కాకి అయిన విషయం తెలిసిందే. 


ఇక బుధవారం మార్కెట్ విషయానికి వస్తే దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. రియల్టీ, బ్యాంక్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, టెలికం, హెల్త్‌కేర్, ఫైనాన్స్ రంగాల సూచీలు 2 - 3 శాతం వరకు క్షీణించాయి. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు, సీఆర్ఆర్(క్యాష్ రిజర్వ్ రేషియో)ను 50 బేసిస్ పాయింట్లు పెంచుతు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లను షాక్‌కు గురిచేసింది.

Read more