71 పట్టణాల్లో జియోఫైబర్ సేవలు
ABN, First Publish Date - 2022-05-13T06:48:58+05:30
ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీతో బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్న జియో ఫైబర్ తెలుగు రాష్ట్రాల్లో సేవలను 71 ప్రధాన పట్టణాలకు విస్తరించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీతో బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్న జియో ఫైబర్ తెలుగు రాష్ట్రాల్లో సేవలను 71 ప్రధాన పట్టణాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతో పాటు ఏలూరు, నెల్లూరు, ఒంగోలు వంటి పట్టణాల్లో కూడా జియో ఫైబర్ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఏపీలో మొత్తం 43 పట్టణాల్లో సేవలు అందిస్తున్నామని జియోఫైబర్ తెలిపింది. కాగా తెలంగాణలో హైదరాబాద్తో పాటు జగిత్యాల్, అదిలాబాద్, కోదాడ వంటి మొత్తం 28 పట్టణాల్లో జియోఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.