వైఎస్ వివేకా హత్య కేసు... హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2022-05-03T00:17:02+05:30
వైఎస్ వివేకా హత్య కేసు... హైకోర్టులో విచారణ
అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా నిందితులు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, గజ్జల ఉమాశంకర్రెడ్డి, సునీల్యాదవ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. దేవిరెడ్డి శివశంకర్రెడ్డి వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని వివేకా కుమార్తె సునీత కోరారు. నిందితుల తరపు వాదనలు పూర్తయ్యాయి. సీబీఐ, సునీత తరపు లాయర్ల వాదనల కోసం విచారణ వాయిదా వేశారు. తదుపరి విచారణ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.