YCPపై ఫైర్.. ఏపీని ఫాసిస్టు రాష్ట్రంగా మార్చేస్తున్నారు: Lokesh
ABN, First Publish Date - 2022-05-12T02:43:57+05:30
YCPపై ఫైర్.. ఏపీని ఫాసిస్టు రాష్ట్రంగా మార్చేస్తున్నారు: Lokesh
అమరావతి: వైసీపీ (YCP) ప్రభుత్వంపై ఏపీ మాజీ మంత్రి నారా Lokesh విమర్శలు గుప్పించారు. ఏపీని ఫాసిస్టు రాష్ట్రంగా మార్చేస్తున్నారని ట్విటర్లో లోకేష్ పేర్కొన్నారు. నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని పెద్దిరెడ్డి చెప్పడం షాక్కు గురిచేసిందని లోకేష్ తెలిపారు. టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు వైసీపీ చట్టాలు, రాజ్యాంగాన్ని సైతం విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. ఇష్టానుసారంగా ఫోన్లు ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.