ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభం
ABN, First Publish Date - 2022-05-05T06:32:01+05:30
నూజివీడు ట్రిపుల్ ఐటీలో భాగంగా నడుస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్–3 విద్యార్థులు నిర్వహిస్తున్న ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘ఆర్టిస్టా’ను నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రారంభించారు.
నూజివీడు టౌన్, మే 4: నూజివీడు ట్రిపుల్ ఐటీలో భాగంగా నడుస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్–3 విద్యార్థులు నిర్వహిస్తున్న ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘ఆర్టిస్టా’ను నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గీసిన పెన్సిల్ ఆర్ట్, వర్లీ ఆర్ట్ ప్రదర్శన నిర్వహించారు. క్యాంపస్–3 అకడమిక్ కో–ఆర్డినేటర్ చిన్నారావు, అడ్మిస్ట్రేటివ్ కో–ఆర్డినేటర్ కిరణ్ పాల్గొన్నారు.