వేసవిలోనే నిండిన ‘పెద్దేరు’
ABN, First Publish Date - 2022-05-14T06:58:00+05:30
మండలంలోని పెద్దేరు జలాశయం వర్షాకాలం రాకముందే జలకళను సంతరించుకుంది.
స్పిల్వే గేట్ల నుంచి 540 క్యూసెక్కులు విడుదల
మాడుగుల రూరల్, మే 13: మండలంలోని పెద్దేరు జలాశయం వర్షాకాలం రాకముందే జలకళను సంతరించుకుంది. గత నెల రోజుల నుంచి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద నీరు చేరుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు కాగా గురువారం అర్ధరాత్రికి 136.6 మీటర్లకు చేరింది. వరద నీరు వచ్చి చేరుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా స్పిల్వే గేట్ల నుంచి 540 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ఏఈ సుధాకరరెడ్డి తెలిపారు.