మంత్రి Gudivada Amarnathపై ప్రణవ్ గోపాల్ ఫైర్..
ABN, First Publish Date - 2022-05-06T21:34:12+05:30
మంత్రి గుడివాడ అమర్నాథ్పై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ.ప్రణవ్ గోపాల్ విమర్శలు చేశారు.
Visakha: మంత్రి గుడివాడ అమర్నాథ్పై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ.ప్రణవ్ గోపాల్ విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పరిపాలన అంటే జగన్ రెడ్డి కాళ్లకు మొక్కి తెచ్చుకునే మంత్రి పదవి అనుకున్నారా? అంటూ ప్రశ్నించారు. కొత్తగా మంత్రి పదవి వచ్చేసరికి కొత్త బిచ్చగాడి వలే వాస్తవాలను మరిచి ఊహాలోకంలో గడుపుతున్నారని, నల్ల క్వారీలు వద్ద నెలవారీ చందాలు వసూలు చేయడం అనుకుంటున్నారా? అంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని తుంపాల చక్కెర కర్మాగారాన్ని ఆదుకుంటానని చెప్పి వారిని రోడ్డున పడేసిన దిక్కులేని చరిత్ర మంత్రిదంటూ దుయ్యబట్టారు. నవరత్నాలు అంటూ నవ మోసాలు చేసి బాదుడే బాదుడుతో పేదవాడి బతుకును ఛిద్రం చేశారన్నారు. రాష్ట్రంలో పేదవాడు, సామాన్యుడు ప్రశాంతంగా బ్రతికే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ భిక్షతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అమర్నాథ్కు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని ప్రణవ్ గోపాల్ అన్నారు.