-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » pramadam anchuna-NGTS-AndhraPradesh
-
ప్రమాదం అంచున ప్రయాణం
ABN , First Publish Date - 2022-05-11T06:42:49+05:30 IST
పెదబయలు నుంచి ముంచంగిపుట్టు మీదుగా జోలాపుట్టు వరకు సుమారు 32 కిలోమీటర్ల తారు రోడ్డు ఉంది.
కోతకు గురైన రహదారుల అంచులు
రోడ్లకు ఇరువైపులా పెరిగిపోయిన తుప్పలు
నిర్వహణ పనులు చేపట్టని అధికారులు
ప్రమాదాలబారిన వాహనదారులు
ముంచంగిపుట్టు, మే 10:
పెదబయలు నుంచి ముంచంగిపుట్టు మీదుగా జోలాపుట్టు వరకు సుమారు 32 కిలోమీటర్ల తారు రోడ్డు ఉంది. మండల కేంద్రం నుంచి సంగడ వరకు 35 కిలోమీటర్లు, మండల కేంద్రం నుంచి కుమడకు 11 కిలోమీటర్ల రహదారి ఉంది. బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసే సమయంలో రహదారికి ఇరువైపులా బెర్మ్ నిర్మాణం చేపట్టాలి. రోడ్డు బాగా ఎత్తుగా వున్నచోట అంచుల వద్ద రాతిపేర్పు చేసి, మట్టిపోసి రోలింగ్ చేయాలి. వర్షపునీరు రహదారులపై నుంచి ప్రవహించకుండా తగిన చర్యలు చేపట్టాలి. కానీ రోడ్డు నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్లు, అధికారులు వీటి గురించి పట్టించుకోలేదు. అడుగులుపుట్టు, రంగినిగెడ్డ, కిలగాడ, వనభసింగి, కించాయిపుట్టు, రాజ్మామిడి, పనసపుట్టు, బోండ్రుగూడ, మాకవరం, అస్త్రాడ, సంగడ, కుమడ, కరిముక్కిపుట్టు తదితర ప్రాంతాల్లో రహదారుల అంచులు వర్షపు నీటితో కోతకు గురై గోతులు ఏర్పడ్డాయి. దీంతో రాత్రిపూట ఏమాత్రం అజాగ్రత్తగా వాహనం నడిపినా ప్రమాదానికి గురికాకతప్పదు. కొన్నిచోట్ల తుప్పలు విపరీతంగా పెరిగిపోవడంతో మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనం దగ్గరకు వచ్చే వరకు కనిపించక ప్రమా దాలు జరుగుతున్నాయి. ఆర్అండ్బీ అధికారులు ఇప్పటికైనా స్పందించి కోతకు గురైన రోడ్డు అంచుల వద్ద రాతిపేర్పు చేపట్టి, తుప్పలు తొలగించాలని ఆయా పంచాయతీల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

