ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Jagan పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది: Buddha Venkanna

ABN, First Publish Date - 2022-05-04T18:20:35+05:30

ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

Visakha: ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని టీడీపీ state జనరల్ సెక్రటరీ బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని, ఏపీ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలేనన్నారు. అన్ని ధరలూ పెంచి ప్రజలపై జగన్‌ భారం మోపారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్.. బీహార్‌ను మించిపోయిందని, ఈ ఘనత సీఎం జగన్‌దేనన్నారు. ఆంధ్రాలో దారుణమైన పరిస్థితులు చూడ్డానికి ఇక్కడికి రావాలని ఏపీ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామన్నారు.


సీఎం జగన్‌ను విజయ సాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించారు కాబట్టే...ఆయనకు పార్టీలో పెద్ద పదవులు ఇచ్చారని బుద్దా వెంకన్న ఆరోపించారు. మద్యం షాపులు దగ్గర గూగుల్ పే ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎక్కడా లేని పన్నులు వేస్తున్న జగన్ ఏపీకి ముఖ్యమంత్రా? లేక రాక్షసుడా? అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే లేరని బుద్దా వెంకన్న అన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!