-
-
Home » Andhra Pradesh » visakhapatnam simhachalam devotees andhrparadesh suchi-MRGS-AndhraPradesh
-
ఘనంగా అపన్న చందనోత్సవం...ఇప్పటి వరకు 25 వేల మంది దర్శనం
ABN , First Publish Date - 2022-05-03T13:40:42+05:30 IST
సింహగిరిపై చందనోత్సం సందర్భంగా భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది.
విశాఖపట్నం: సింహగిరిపై చందనోత్సం సందర్భంగా భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. చందనోత్సవంలో ఇప్పటి వరకు 25వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతోంది. కలెక్టర్ మల్లిఖార్జున, సీపీ శ్రీకాంత్ దేవస్థానంలోనే ఉండి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అపరిచితుల కదలికలపై భక్తులు జాగ్రత్తగా ఉండాలని, బయట వ్యక్తులు అందజేసే ప్రసాదాలు స్వీకరించవొద్దని సిటీ పోలీసు కమిషనర్ శ్రీకాంత్ హెచ్చరించారు.