షార్ట్ సర్క్యూట్తో ముగ్గురు రైతుల ఇళ్లు దగ్ధం
ABN, First Publish Date - 2022-05-05T15:50:50+05:30
కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరు గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం ముగ్గురు రైతుల ఇళ్లు దగ్ధమయ్యాయి.
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరు గ్రామంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు రైతుల ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో 120 మినుము బస్తాలు కాలి బూడిదయ్యాయి. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. అగ్నిప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.