ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కళకళలాడుతున్న Venkanna హుండీ

ABN, First Publish Date - 2022-05-05T01:33:48+05:30

తిరుమల వెంకన్న హుండీ ఆదాయం కళకళలాడుతోంది. కరోనా తర్వాత మార్చినెల తరహాలోనే ఏప్రిల్‌ నెలలోనూ హుండీ ఆదాయం వంద కోట్లు దాటింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తిరుమల: తిరుమల వెంకన్న హుండీ ఆదాయం కళకళలాడుతోంది. కరోనా తర్వాత మార్చినెల తరహాలోనే ఏప్రిల్‌ నెలలోనూ హుండీ ఆదాయం వంద కోట్లు దాటింది. ఏప్రిల్‌ 1 నుంచి 30వ తేదీ వరకు 20,62,323 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా, వీరి ద్వారా రూ.127.63 కోట్ల హుండీ ఆదాయం లభించింది. ఏప్రిల్‌ 13వ తేదీన అత్యధికంగా 88,748మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో అత్యధికంగా రూ.5.11 కోట్లు లభించడం గమనార్హం. మార్చి నెలలో 19,72,656 మంది దర్శించుకోగా, వీరు సమర్పించిన కానుకల ద్వారా రూ.128.61 కోట్ల ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గడంతో మార్చి నెల నుంచి టీటీడీ భక్తుల సంఖ్యను పెంచిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఏప్రిల్‌ నెల నుంచి కొన్ని ప్రత్యేక దర్శనాలతో పాటు ఆర్జితసేవలను టీటీడీ తిరిగి ప్రారంభించింది. మరోవైపు టికెట్‌ రహిత దర్శనాలనూ టీటీడీ తిరిగి కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!