శ్రీవారి వారపు సేవలను రద్దు చేయనున్న టీటీడీ

ABN , First Publish Date - 2022-05-07T13:47:51+05:30 IST

శ్రీవారి వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేయనుంది.

శ్రీవారి వారపు సేవలను రద్దు చేయనున్న టీటీడీ

తిరుపతి: శ్రీవారి వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేయనుంది. అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, నిజపాద సేవ దర్శనం సేవల రద్దుకు టీటీడీ ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికే సేవల టిక్కెట్లు తీసుకున్న భక్తులకు ప్రత్యామ్నాయంగా బ్రేక్ దర్శనాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదనంగా దర్శన సమయం కేటాయించడానికే సేవల రద్దని టీటీడీ పేర్కొంది. ఇప్పటికే విశేష పూజ, సహస్ర కలశాభిషేకం, నిత్య సేవైన వసంతోత్సవాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నిర్వహించే అభిషేక సేవ మినహా అన్ని వారపు సేవలు రద్దు చేయనుంది. కాగా... టీటీడీ నిర్ణయంపై భక్తులు, పీఠాధిపతులు మండిపడుతున్నారు. 

Read more