అరకులోయ కరెంట్ క్వార్టర్స్లో విషాదం
ABN, First Publish Date - 2022-05-03T14:33:13+05:30
జిల్లాలోని అరకులోయ కరెంట్ క్వార్టర్స్లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో భార్యాభర్తలు మృతి చెందారు.
అల్లూరి: జిల్లాలోని అరకులోయ కరెంట్ క్వార్టర్స్లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో భార్యాభర్తలు మృతి చెందారు. సర్వీస్ వైర్పై బట్టలు ఆరబెడుతుండగా పవర్ ఎర్త్తో భర్త షాక్కు గురయ్యాడు. భర్తను కాపాడే క్రమంలో భార్యకు కరెంట్ షాక్ తగిలింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భార్యాభర్తలను గమనించిన స్థానికులు వెంటనే 108కు కాల్ చేశారు. అయితే అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో ఘటనా స్థలంలో దంపతులు మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.