-
-
Home » Andhra Pradesh » the telangana government is busy investigating the fertilizer scam vijayawada andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
ఎరువుల కుంభకోణంపై Telangana ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం
ABN , First Publish Date - 2022-05-13T16:50:25+05:30 IST
ఎరువుల కుంభకోణంపై తెలంగాణ సర్కార్ దర్యాప్తును ముమ్మరం చేసింది.
విజయవాడ: ఎరువుల కుంభకోణంపై తెలంగాణ సర్కార్ దర్యాప్తును ముమ్మరం చేసింది. సత్తుపల్లి పరిసరాల్లో ఇటీవల కల్తీ పొటాష్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇసుక రంగుమార్చి పొటాష్గా తెలంగాణలో విక్రయిస్తున్నట్లు రైతులు గుర్తించారు. రైతుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన తెలంగాణ సర్కార్ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఏపీకి తెలంగాణ అధికారుల బృందం చేరుకుంది. విజయవాడ రూరల్ నున్న, సూరంపల్లిలోని హేమ బయోటెక్, ఇతర ఆగ్రో పరిశ్రమలను తెలంగాణ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. పరిశ్రమ నిర్వాహకుల నుంచి తెలంగాణ అధికారుల బృందం పూర్తి వివరాలు సేకరిస్తోంది.