-
-
Home » Andhra Pradesh » Tenth Examinations-MRGS-AndhraPradesh
-
పగడ్బందీగా Tenth Examinations నిర్వహిస్తున్నాం: Botsa
ABN , First Publish Date - 2022-05-05T00:32:07+05:30 IST
పగడ్బందీగా టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
విజయవాడ: పగడ్బందీగా టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్నిచోట్ల చిన్న సంఘటనలను రాజకీయంగా వివాదం చేశారని విమర్శించారు. Tdp హయాంలో Paper leaks mass copying చేసినా చర్యలు లేవన్నారు. తాము అన్ని విభాగాలను అలెర్ట్ చేసి చర్యలు చేపట్టామని తెలిపారు. 60 మందిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతిపక్షాల అల్లరి చూస్తుంటే అక్రమార్కులను ప్రోత్సహించినట్లుగా ఉందని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.