ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వైసీపీ అరాచకాలు, దుర్మార్గాలకు టీడీపీ నేతలు లొంగలేదు: శ్రీనివాసరావు

ABN, First Publish Date - 2022-05-06T01:40:45+05:30

వైసీపీ అరాచకాలు, దుర్మార్గాలకు టీడీపీ నేతలు లొంగలేదు: శ్రీనివాసరావు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: వైసీపీకి దక్కిన దుగ్గిరాల ఎంపీపీ పదవి టీడీపీ పెట్టిన భిక్ష అని టీడీపీ సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వైసీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీలను కూడా నమ్మలేకపోయాడని మండిపడ్డారు. తన సొంత పార్టీ ఎంపీటీసీ సభ్యులపై నమ్మకం లేకే ఎమ్మెల్యే ఆర్కే వైసీపీ ఎంపీటీసీ సభ్యులను ఎంపీపీ ఎన్నికకు దూరంగా ఉంచారని విమర్శించారు. అనైతిక చర్యలతో దుగ్గిరాల ఎంపీపీ పదవిని వైసీపీ కైవసం చేసుకుందని, ఎంపీటీసీ ఎన్నికల నాటి నుంచి టీడీపీ నేతలపై ఎన్నో కక్ష పూర్తి చర్యలకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్పడ్డారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నో అరాచకాలు.. ఎన్నో దుర్మార్గాలకు వైసీపీ నేతలు పాల్పడ్డా, టీడీపీ నేతలు లొంగలేదన్నారు. బీసీ మైనార్టీకి చెందిన ముస్లిం మహిళకు ఎంపీపీ పదవి దక్కకుండా, ఎమ్మెల్యే ఆర్కే దుర్మార్గంగా వ్యవహరించారని ఆయన ధ్వజమెత్తారు. సొంత పార్టీ ఎంపీటీసీ సభ్యులను కూడా కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అని శ్రీనివాసరావు మండిపడ్డారు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!