తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో Nakka Anand babu పర్యటన
ABN, First Publish Date - 2022-05-10T17:10:14+05:30
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో మాజీ మంత్రి నక్క ఆనంద బాబు మంగళవారం ఉదయం పర్యటించారు.
గుంటూరు: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో మాజీ మంత్రి నక్క ఆనంద బాబు(Nakka Anand Babu) మంగళవారం ఉదయం పర్యటించారు. వేమూరు నియోజకవర్గం లోని లంక గ్రామాలలో పొలాల పరిశీలించారు. ఈదురు గాలులతో అరటి, బొప్పాయి, తమలపాకు తోటలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో బాధిత రైతులతో మాట్లాడిన ఆనంద బాబు పంట నష్టంపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో 2 వేల ఎకరాలలో అరటి పంట నాశనం అయిందన్నారు. లంక గ్రామాల రైతులకు నోటికాడికి వచ్చిన పంట నేల పాలు అయిందని తెలిపారు.
లంక గ్రామాల రైతులకు ప్రతి సారి ఏదో రూపంలో దెబ్బ తగులుతోందన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో మాటలకే పరిమితం అవుతోందని విమర్శించారు. ఈదురు గాలులతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని నక్కా ఆనంద బాబు స్పష్టం చేశారు.