-
-
Home » Andhra Pradesh » tdp leader lokesh andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
ప్రొద్దుటూరు సామూహిక అత్యాచార ఘటనపై Lokesh స్పందన
ABN , First Publish Date - 2022-05-12T13:49:26+05:30 IST
సీఎం జగన్ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు.
అమరావతి: సీఎం జగన్(Jagan) సొంత జిల్లాలోని ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) స్పందించారు. ‘‘గన్ కంటే ముందొస్తాడని కోట్ల రూపాయల ప్రకటనల ద్వారా ప్రచారం చేయించుకున్న జగన్ సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే..ఏదా గన్? ఎక్కడా జగన్?’’ అంటూ ప్రశ్నించారు. అమాయక బాలికపై లైంగిక దాడిని మహిళా పోలీసులు వెలుగులోకి తెస్తే పోలీసులు నిందితుల్ని పట్టుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. పదిహేనేళ్లు కూడా నిండని బాలికని గర్భవతిని చేసిన నిందితులని కాపాడటమేనా ఆడబిడ్డలకి కల్పించే రక్షణ అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.