చంద్రబాబు జోలికొస్తే...: Devineni uma
ABN, First Publish Date - 2022-05-11T19:54:59+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు జోలికొస్తే 60 లక్షల మంది కార్యకర్తలు రోడ్డెక్కుతామని మాజీ మంత్రి దేవినేని ఉమామాహేశ్వరరావు హెచ్చరించారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) జోలికొస్తే 60 లక్షల మంది కార్యకర్తలు రోడ్డెక్కుతామని మాజీ మంత్రి దేవినేని ఉమామాహేశ్వరరావు(Devineni umamaheshwar rao) హెచ్చరించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ‘‘నేను బురద చల్లుతా మీరు కడుక్కు చావండి అన్నట్లు జగన్ రెడ్డి తీరుంది’’ అని ఆయన మండిపడ్డారు. తుఫాన్ ప్రభావంతో రైతులు గగ్గోలు పెడుతుంటే సీఎం రాజకీయ కక్షసాధింపుల్లో బిజీగా ఉన్నారని ఆగ్రహించారు. తుఫాన్ ప్రభావం పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అవినీతికి పాల్పడి జైలుకెళ్లిన జగన్ రెడ్డి, తన లానే అంతా ఉంటారని భావిస్తున్నారని విమర్శించారు. తమపై తప్పుడు కేసులు పెట్టడమంటే ఆకాశం మీద ఉమ్మేసుకున్నట్లే అని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.