ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ కరువు: Chandrababu

ABN, First Publish Date - 2022-05-06T18:28:01+05:30

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కాకినాడ: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం  అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్నిరంగాల్లో ప్రజలపై ప్రభుత్వం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పెట్టుకుందని అన్నారు.. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు. ఆడబిడ్డ తల్లుల పెంపకం సరిగాలేదంటూ..మహిళా హోంమంత్రి వ్యాఖ్యానించడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం దిశ చట్టం పేరుతో ప్రచారాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. బాబాయిని చంపిన వ్యక్తులను కాపాడుతూ చెల్లికి అన్యాయం చేస్తున్న వ్యక్తి సీఎం జగన్‌ అని మండిపడ్డారు. జగన్‌ పాలనలో గల్లీకో సైకో తయారవుతున్నాడన్నారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టడంతో ప్రభుత్వం విఫలమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచక ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని... ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!