AP: టీడీపీ కార్యకర్త మామిడి తోటకు నిప్పు
ABN, First Publish Date - 2022-05-04T17:10:38+05:30
జిల్లాలోని ధర్మవరం మండలం ఎల్లక్కుంట్లలో టీడీపీ కార్యకర్త గుత్తా సూర్యనారాయణకు చెందిన మామిడి తోటకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.
శ్రీసత్యసాయి: జిల్లాలోని ధర్మవరం మండలం ఎల్లక్కుంట్లలో టీడీపీ కార్యకర్త గుత్తా సూర్యనారాయణకు చెందిన మామిడి తోటకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో మామిడి టేకు ఎర్రచందనం చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. పది లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి నీటితోనే సాగుచేసుకుంటున్న తోటకు నిప్పు పెట్టడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.