Somu Veerraju: up తరహా పాలన apలో ఉండాలి
ABN, First Publish Date - 2022-05-03T21:57:05+05:30
ఏపీలో మహిళలపై ఆకృత్యాలు ఎక్కువైపోయాయని ap bjp అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.
అమరావతి:ఏపీలో మహిళలపై ఆకృత్యాలు ఎక్కువైపోయాయని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపల్లె,విజయవాడలో జరిగిన ఘటనలు దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. యూపీలో నేరస్తులను యోగీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తుందన్నారు. యూపీ తరహా పాలన ఏపీలో ఉండాలని చెప్పారు. ఏపీలో గంజాయి విస్తృతంగా దొరుకుతుందని,మాదక ద్రవ్యాలు వినియోగించే వారిని వైసీపీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్లు విజృంభిస్తున్నాయన్నారు. ఖాళీగా ఉన్న పోలీస్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సోము వీర్రాజు కోరారు.