-
-
Home » Andhra Pradesh » SIPB meeting chaired by Jagan-MRGS-AndhraPradesh
-
Jagan అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం
ABN , First Publish Date - 2022-05-12T22:58:06+05:30 IST
సీఎం జగన్( Jagan) అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.
అమరావతి: సీఎం జగన్( Jagan) అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్కు ఆమోదం తెలిపారు. 100 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటుతో 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా ఎగుమతులు అవుతున్నాయని, ఆర్బీకేల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశంలో మెరైన్ ఎగుమతుల్లో 46 శాతం ఏపీ నుంచే వెళ్తున్నాయని తెలిపారు. మెరైన్ రంగాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమలకు అనుమతిపై నిరంతర పర్యవేక్షించాలని సూచించారు. విశాఖలో త్వరగా డేటా సెంటర్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు.