AP News: అల్లకల్లోలంగా సముద్రం
ABN, First Publish Date - 2022-05-10T01:27:34+05:30
బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుఫాన్ తీరాన్ని వణికిస్తోంది. విజయనగరం జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.
విజయనగరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుఫాన్ తీరాన్ని వణికిస్తోంది. విజయనగరం జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. పెద్ద శబ్ధం చేస్తూ అలలు సోమవారం మధ్యాహ్నం నుంచి తీరాన్ని తాకుతున్నాయి. సముద్రం 50 మీటర్లు ముందుకొచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తున్న భోగాపురం మండలంలోని ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు గ్రామాల మత్స్యకారులు కలవర పడుతున్నారు. సముద్రం పైనుంచి ఈదురుగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ఆ భీకరానికి ఆయా గ్రామాల్లోని చెట్లు మొత్తం ఒకవైపుగా వాలిపోతున్నాయి. కెరటాలు గ్రామాలను తాకుతుండడంతో తీరం కోతకు గురవుతోంది. తుపాను పరిస్థితుల్లో చేపలవేటకు వెళ్ల వద్దని, తీరప్రాంత గ్రామాలన్నీ అప్రమత్తంగా ఉండాలని పూసపాటిరేగ తహసీల్దారు కృష్ణమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద హెచ్చరికలు తెలియజేస్తూ ఎర్ర రంగు జెండాను చింతపల్లి గ్రామంలో సోమవారం ఏర్పాటుచేశారు.