అధికార అహంకారంతో అరాచకాలా?: శైలజానాథ్
ABN, First Publish Date - 2022-05-02T22:52:34+05:30
అధికార అహంకారంతో అరాచకాలా?: శైలజానాథ్
అమరావతి: అధికార అహంకారంతో అరాచకాలా? అని అధికార పార్టీ నేతలను ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలకు రక్షణ ఎక్కడ? దాడులు చేస్తున్నవారిపై శిక్షలెక్కడ? అని ప్రశ్నించారు. డమ్మీ హోంమంత్రితో మహిళలకు ఏం ప్రయోజనం ఉందని నిలదీశారు. సొంత మీడియాతో, సలహదారులనే జీతగాళ్లతో కాకమ్మ కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. చెప్పేది కొండంత.. చేసేది గోరంత అని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్రెడ్డి బయటకు వచ్చి చూడాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.