మరోసారి తడబడిన మంత్రి రోజా
ABN, First Publish Date - 2022-05-08T00:34:51+05:30
యథా రాజా తథా ప్రజా అంటారు పెద్దలు. ప్రజల సంగతేమోగాని వైసీపీ నేతలు ఈ సూత్రాన్ని అక్షరాల పాటిస్తుంటారు. సభలు, సమావేశాల్లో ..
VIsakha: యథా రాజా తథా ప్రజా అంటారు పెద్దలు. ప్రజల సంగతేమోగాని వైసీపీ నేతలు ఈ సూత్రాన్ని అక్షరాల పాటిస్తుంటారు. సభలు, సమావేశాల్లో సరైన అవగాహన లేక తరచూ తడబడి నాలుక కర్చుకోవడం జగన్కూ, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు అదే కోవలో రోజా (Roja) కూడా చేరారు.
విశాఖలో ఏర్పాటు చేసిన సీతారామరాజు (SeetharamaRaju) వర్థంతి కార్యక్రమంలో రోజా అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy)ముఖ్య అతిథిగా పాల్గొన్న సభలో తడబట్టారు. మంత్రి అమర్నాథ్ (Amarnath)ను సంబోధించే సమయంలో అమర్నాథ్రెడ్డి అని పిలుచారు. అమర్నాథ్రెడ్డి అని రోజా సంబోధించగానే వేదికపై ఉన్నవారు అమర్నాథ్రెడ్డి కాదు.. అమర్నాథ్ అని సర్ది చెప్పారు. అయినా సరే తన వ్యాఖ్యలను సరి చేయకుండా చిరునవ్వుతో స్పీచ్ను కొనసాగించడంతో అక్కడున్న వారు నివ్వెర పోయారు.