Srisatyasai జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా
ABN, First Publish Date - 2022-05-09T13:27:46+05:30
జిల్లాలోని బత్తలపల్లి మండలం తంబాపురం సమీపంలో సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.
శ్రీ సత్య సాయి: జిల్లాలోని బత్తలపల్లి మండలం తంబాపురం సమీపంలో సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలవగా... బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. బస్సు అనంతపురం నుంచి కదిరి వైపు వెళుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.